సీబీఐ తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
ABN , First Publish Date - 2021-10-28T20:25:09+05:30 IST
జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచ్ ప్రభాకర్ వ్యవహారంపై కోర్టు సీరియస్ అయింది..
అమరావతి: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచ్ ప్రభాకర్ వ్యవహారంపై కోర్టు సీరియస్ అయింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రభాకర్ దెబ్బతీస్తున్నారని న్యాయస్థానం మండిపడింది. ప్రభాకర్ను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారంటూ సీబీఐని నిలదీసింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సీబీఐ పట్టించుకోలేదంటూ హైకోర్టుకు స్టాండింగ్ కౌన్సిల్ అశ్విని కుమార్ విన్నవించారు. కనీసం నోటీసు కూడ ఇవ్వలేకపోయారని స్టాండింగ్ కౌన్సిల్ తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లకు నోటీసులు ఇవ్వాలని, ప్రభాకర్ వీడియోలు తొలగించేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది కోరారు. హైకోర్టు నుంచి సీబీఐకి లేఖ రాయాలని ధర్మాసనం ఆదేశించింది.