మహాపాదయాత్ర ముగింపు సభ అనుమతిపై రేపు High courtలో విచారణ
ABN , First Publish Date - 2021-12-14T17:34:25+05:30 IST
రాజధాని రైతుల మహా పాదయాత్ర ముగింపు సభ అనుమతి కోసం వేసిన పిటిషన్పై రేపు విచారణ చేయనున్నట్లు హైకోర్టు తెలిపింది.
అమరావతి: రాజధాని రైతుల మహా పాదయాత్ర ముగింపు సభ అనుమతి కోసం వేసిన పిటిషన్పై రేపు(బుధవారం) విచారణ చేయనున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈరోజు కోర్టు ముందు ఈ అంశాన్ని న్యాయవాదులు ప్రస్తావించారు. మూడు రాజధానులకు అనుకూలంగా సభ నిర్వహించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని మరికొన్ని పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో వీటన్నింటిపై రేపు విచారణ చేపడతామని హైకోర్ట్ పేర్కొంది.