AP హైకోర్టును ఆశ్రయించి పశ్చిమగోదావరి జిల్లా వాసి
ABN , First Publish Date - 2021-12-10T19:30:35+05:30 IST
దళితుడైన తన బిడ్డను అతి కిరాతకంగా చంపినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఏపీ హైకోర్టులో పశ్చిమగోదావరి జిల్లా వాసి గడ్డం బుల్లయ్య పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: దళితుడైన తన బిడ్డను అతి కిరాతకంగా చంపినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఏపీ హైకోర్టులో పశ్చిమగోదావరి జిల్లా వాసి గడ్డం బుల్లయ్య పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారని పిటిషనర్ తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పటికీ నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారన్న లాయర్ తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు... ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేసి నెలరోజుల్లోపు నిందితులను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిష్పక్షపాతంగా విచారణ పూర్తి చేయాలంటూ పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది.