AP Highcourt: ఏపూరు చెరువులో మట్టి తవ్వకాలపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2022-07-29T20:31:47+05:30 IST
ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఏపూరు చెరువులో మట్టి తవ్వకాలపై ఏపీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.
అమరావతి: ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఏపూరు చెరువులో మట్టి తవ్వకాలపై ఏపీ హైకోర్టు(AP Highcourt)లో శుక్రవారం విచారణ జరిగింది. దెందులూరు ఎమ్మెల్యే(Deduluru MLA) అనుచరుల అక్రమ మట్టి తవ్వకాలపై విచారణ జరుగగా... గత విచారణ సమయంలో అక్రమ మట్టి తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని మైనింగ్ డీడీని ధర్మాసనం ఆదేశించింది. 14 వేల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తవ్వకాలు జరిగాయని మైనింగ్ డీడీ నివేదిక ఇచ్చింది. మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మట్టి తవ్వకాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశిస్తూ... తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది.