గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఏపీ హైకోర్టు నూతన జడ్జి

ABN , First Publish Date - 2021-10-10T15:26:42+05:30 IST

ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తి అహసానుద్దీన్ అమణుల్లాహ్ ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్టుకు  చేరుకున్న ఏపీ హైకోర్టు నూతన జడ్జి

విజయవాడ: ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తి అహసానుద్దీన్ అమణుల్లాహ్ ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్‌లో అమణుల్లాహ్‌కు నూజివీడు సబ్ కలెక్టర్ రాజలక్ష్మి, పెడన తాసిల్దార్ మధుసూదన్ రావు, గన్నవరం డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాస రావు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గాన నేరుగా గేట్ వే హోటల్‌కు అమణుల్లాహ్ బయలుదేరి వెళ్ళారు.  మరికాసేపట్లో హైకోర్టు నూతన న్యాయమూర్తిగా అమణుల్లాహ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Updated Date - 2021-10-10T15:26:42+05:30 IST