AP: రాజధానిలో అసైన్డ్ రైతులకు హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2021-09-13T18:54:42+05:30 IST
రాజధానిలో అసైన్డ్ రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. అసైన్డ్ రైతుల భూముల క్రయ విక్రయాలకు సంభందించి జారీ చేసిన జీవో నెంబర్ 316పై ధర్మాసనం స్టేటస్ కో ఇచ్చింది.
అమరావతి: రాజధానిలో అసైన్డ్ రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. అసైన్డ్ రైతుల భూముల క్రయ విక్రయాలకు సంబంధించి జారీ చేసిన జీవో నెంబర్ 316పై ధర్మాసనం స్టేటస్ కో ఇచ్చింది. న్యాయవాది ఇంద్రనీల్ బాబు జీవో నెంబర్ 316ను హైకోర్టులో సవాలు చేశారు. నోటీసులు ఇవ్వకుండా కేటాయించిన ప్లాట్లను రద్దు చేసేందుకు జీవో ఇచ్చారని ఇంద్రనీల్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం వైపు వాదనలు విన్న అనంతరం ధర్మాసనం స్టేటస్ కో విధించింది. తదనంతర ప్రక్రియ చేపట్టవద్దని ఏఎమ్ఆర్డీఏకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.