మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2020-11-25T20:05:14+05:30 IST
మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది.
అమరావతి: మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై బుధవారం న్యాయస్థానం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున కౌంటర్లు పిటిషనర్లకు అందలేదని.. అందుచేత విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. తుది తీర్పునకు లోబడే ఆక్షన్ ఉండాలని గతంలో ఇచ్చిన..మధ్యంతర ఉత్తర్వులు కేసు తదుపరి ఆదేశాల వరకు కొనసాగింపు ఉంటుందని పేర్కొంది. కాగా దీనిపై గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్బాబు హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.