ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై హైకోర్టు విచారణ
ABN , First Publish Date - 2021-08-09T20:21:18+05:30 IST
ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై సోమవారం ఏపీ హైకోర్టులో 26 పిటిషన్లపై విచారణ జరిగింది.
అమరావతి: ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై సోమవారం ఏపీ హైకోర్టులో 26 పిటిషన్లపై విచారణ జరిగింది. నరేగా పనులు చేసిన వారందరికీ బిల్లులు చెల్లిస్తున్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. అయితే వాటికి సంబంధించిన స్టేటస్ రిపోర్టు, బిల్లుల చెల్లింపు వివరాలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశిస్తూ.. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.