ఏపీలో కోవిడ్ కేసులపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు
ABN , First Publish Date - 2021-05-13T18:10:57+05:30 IST
ఏపీలో కోవిడ్ కేసుల పెరుగుదల, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్ట్లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
విజయవాడ: ఏపీలో కోవిడ్ కేసుల పెరుగుదల, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్ట్లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆలిండియా లాయర్స్ యూనియన్ ఈ పిల్ను దాఖలు చేసింది. ఏపీలో పెరుగుతోన్న కేసులు, తీసుకోవాల్సిన చర్యలు, అందరికీ వ్యాక్సినేషన్, కోవిడ్ మందుల ధరల నియంత్రణపై లాయర్స్ యూనియన్ పిటిషన్లో ప్రస్తావించింది. కరోనా పేషెంట్లకు పడకలు అందుబాటులో లేవని పిటిషనర్లు పేర్కొన్నారు. రెమ్ డెసివిర్ లాంటి మందులు బ్లాక్ మార్కెట్లో విక్రయంపై పిటిషన్లో ప్రస్తావించారు. కోవిడ్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ కోరింది.