బ్రేకింగ్: ఏపీ ప్రభుత్వ మరో రాజకీయ కక్ష సాధింపు!

ABN , First Publish Date - 2020-02-23T04:15:26+05:30 IST

ఏపీ ప్రభుత్వం మరో రాజకీయ కక్ష సాధింపు దిశగా అడుగులేసింది.!.

బ్రేకింగ్: ఏపీ ప్రభుత్వ మరో రాజకీయ కక్ష సాధింపు!

అమరావతి : ఏపీ ప్రభుత్వం మరో రాజకీయ కక్ష సాధింపు దిశగా అడుగులేసింది.!. ఏపీ ఎన్జీవోలకు ప్రభుత్వం నోటీసులు పంపింది. 2018లో తిరుపతి ఏపీఎన్జీవో సమావేశంలో అప్పటి సీఎం, మంత్రులు నిబంధనలకు విరుద్ధంగా పాల్గొన్నారంటూ అధ్యక్షుడికి నోటీస్‌ పంపడం జరిగింది. మీ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడికి సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి లేఖ రాశారు.


సభ్యులుకాని వాళ్లు సమావేశంలో ఎలా పాల్గొన్నారు? అని ప్రశ్నించారు. ఏపీ ఎన్జీవో బైలాస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయలేదని ఆరోపిస్తున్నారు. ఏపీ ఎన్జీవోల సంఖ్యను ఇంత వరకు ప్రభుత్వానికి చెప్పలేదంటూ సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి లేఖలో పేర్కొన్నారు. ఏపీ ఎన్జీవోలకు కేటాయించిన స్థలాన్ని మిస్‌యూజ్‌ చేస్తున్నారని లేఖలో కార్యదర్శి పేర్కొన్నారు.

Updated Date - 2020-02-23T04:15:26+05:30 IST