AP: ఎంఎస్ఎంఈలకు రుణ సంక్షోభం

ABN , First Publish Date - 2022-02-18T16:34:30+05:30 IST

ప్రభుత్వం నుంచి రాయితీకి స్థలాలు తీసుకుంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు రుణం...

AP: ఎంఎస్ఎంఈలకు రుణ సంక్షోభం

విజయవాడ: ప్రభుత్వం నుంచి రాయితీకి స్థలాలు తీసుకుంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు రుణం దొరకడం కష్టంగా మారింది. ఈ పరిశ్రమలకు ప్రభుత్వం అందించే సాయం అంతంతమాత్రమే. దీంతో బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలే ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు కీలకం. అయితే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న స్థలానికి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ఉంటేనే రుణాలు ఇస్తామని బ్యాంకులు చెబుతున్నాయి. ప్రభుత్వం మాత్రం లీజ్ డీడ్ మాత్రమే ఇస్తామని చెబుతోంది. ఎవరొచ్చినా భూమిని 33 ఏళ్లకు లీజుకు ఇస్తామని, పదేళ్ల తర్వాత సేల్ డీడ్‌కు వీలు కల్పిస్తామని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. దీంతో రుణాలు దొరక్కా సంక్షోభంలో పడిపోయిన తమను  సేల్ డీడ్ ద్వారా ఆదుకోవాలని ఎంఎస్ఎంఈలు కోరుతున్నాయి.

Updated Date - 2022-02-18T16:34:30+05:30 IST