ఆర్థిక సాయం ఇవ్వట్లేదని అనంతలో బాధితుడి నిరసన

ABN , First Publish Date - 2020-04-04T22:20:14+05:30 IST

లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఆర్థిక సాయం ఇవ్వాలని..

ఆర్థిక సాయం ఇవ్వట్లేదని అనంతలో బాధితుడి నిరసన

అనంతపురం : లాక్ డౌన్  నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఆర్థిక సాయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే.. తనకు ఆర్థిక సాయం అందట్లేదని కృష్ణ అనే వ్యక్తి నిరసన వ్యక్తం చేశాడు. బాధితుడు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉరవకొండలో సచివాలయం ముందు బైఠాయించాడు.


కాగా.. ఆయన ఉరవకొండ పట్టణంలోని పదో వార్డులో నివాసముంటున్నాడు. బియ్యం కార్డు ఉన్నప్పటికీ  వెయ్యి రూపాయలు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-04-04T22:20:14+05:30 IST