కరోనా నుంచి కోలుకుని ఏపీ రాజ్‌భవన్‌కు చేరుకున్న గవర్నర్

ABN , First Publish Date - 2021-11-23T20:55:46+05:30 IST

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి కోలుకుని ఏపీకి చేరుకున్నారు.

కరోనా నుంచి కోలుకుని ఏపీ రాజ్‌భవన్‌కు చేరుకున్న గవర్నర్

కృష్ణా జిల్లా: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకుని మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. గన్నవరం నుంచి నేరుగా విజయవాడ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.


ఇటీవల కాలంలో ఆయన ఢిల్లీ పర్యటనతోపాటు పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. ఈ నెల 16న గవర్నర్‌కు కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు భావించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. 

Updated Date - 2021-11-23T20:55:46+05:30 IST