దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు
ABN , First Publish Date - 2021-10-07T14:32:04+05:30 IST
ఇంద్రాకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
విజయవాడ: ఇంద్రాకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గవర్నర్ దంపతులు బిశ్వ భూషణ్ హరి చందన్, సప్రవ హరి చందన్ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అలంకారం అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు తొలి పూజలో పాల్గొన్నారు. గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తెలుగు ప్రజలకు అమ్మవారి కృప, కరుణా కటాక్షాలు లభించాలని గవర్నర్ ఆకాంక్షించారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని గవర్నర్ హరి చందన్ తెలిపారు.