AP: రాజ్‌భవన్‌లో ఉపకులపతుల సదస్సు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-05T17:07:32+05:30 IST

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేతృత్వంలో ఉపకులపతుల సదస్సు గురువారం ఉదయం ప్రారంభమైంది.

AP: రాజ్‌భవన్‌లో ఉపకులపతుల సదస్సు ప్రారంభం

విజయవాడ: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేతృత్వంలో ఉపకులపతుల సదస్సు గురువారం ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాల నుండి ఉప కులపతులు హాజరయ్యారు. కులపతి హోదాలో బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభోపన్యాసం చేశారు. రాజ్‌భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీసీసోడియా, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాలకొండయ్య, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు హేమచంద్ర రెడ్డి సదస్సుకు హాజరయ్యారు. 

Read more