పుట్టినరోజు వేడుకలకు ఏపీ గవర్నర్ దూరం
ABN , First Publish Date - 2021-08-01T21:29:55+05:30 IST
ఈ సారి కూడా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకూదడని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి: ఈ సారి కూడా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకూదడని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 3వ తేదీ ఏపీ గవర్నర్ పుట్టినరోజు... అయితే కరోనా పరిస్థితుల కారణంగా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ రాజ్భవన్కు రావద్దని విజ్ఞప్తి చేశారు. అర్హులైన వారందరూ కరోనా టీకా వేయించుకోవాలని బిశ్వభూషణ్ కోరారు. ప్రతి ఒక్కరు కరోనా నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత ఏడాది కూడా గవర్నర్ పుట్టినరోజు వేడుకులు జరుపుకోలేదు.