జన్మదిన వేడుకలకు దూరంగా గవర్నర్‌

ABN , First Publish Date - 2021-08-02T07:57:38+05:30 IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ తన జన్మదినాన్ని జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు. కరోనా కారణంగా గతేడాది గవర్నర్‌

జన్మదిన వేడుకలకు దూరంగా గవర్నర్‌

కరోనా నేపథ్యంలో రెండో ఏడాది రద్దు

శుభాకాంక్షలు తెలిపేందుకు రావద్దంటూ రాజ్‌భవన్‌ విజ్ఞప్తి


అమరావతి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ తన జన్మదినాన్ని జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు. కరోనా కారణంగా గతేడాది గవర్నర్‌ జన్మదినాన్ని జరుపుకోలేదు. ఈ ఏడాది కూడా కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవ్వరూ రాజ్‌భవన్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా ప్రమాదాన్ని తగ్గించడంలో, వైరస్‌ నుంచి రక్షణ కల్పించడంలో టీకా సహాయపడుతుందన్నారు. అర్హులైన వారందరూ టీకాలు వేయించుకోవాలని ఆయ న కోరారు.  

Updated Date - 2021-08-02T07:57:38+05:30 IST