ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ తులసిరెడ్డి

ABN , First Publish Date - 2020-07-09T22:32:42+05:30 IST

ఏపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గోటితో గిచ్చుతూ.. నోటితో జోలపాట పాడినట్లు ఉందని తప్పుబట్టారు.

ఏపీ ప్రభుత్వంపై  మండిపడ్డ తులసిరెడ్డి

కడప: ఏపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గోటితో గిచ్చుతూ.. నోటితో జోలపాట పాడినట్లు ఉందని తప్పుబట్టారు. వ్యవసాయరంగానికి బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించారని, రుణమాఫీ బకాయిలు రూ. 8 వేల కోట్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. పులివెందులలో అరటి, నిమ్మ తోటలు కొనే నాథుడు లేడన్నారు. రైతు దినోత్సవమని ప్రకటించినంత మాత్రాన ఉపయోగం లేదని, రైతులకు మేలు చేసే విధంగా పనిచేయాలని తులసిరెడ్డి సూచించారు.

Updated Date - 2020-07-09T22:32:42+05:30 IST