ఆహార భద్రతపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి: సోమువీర్రాజు
ABN , First Publish Date - 2022-04-20T23:15:23+05:30 IST
ఆహార భద్రతపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ నేత సోమువీర్రాజు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బియ్యం కావాలా..
అమరావతి: ఆహార భద్రతపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ నేత సోమువీర్రాజు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బియ్యం కావాలా.. డబ్బులు కావాలా అనే ధోరణి ఖండిస్తున్నామని ప్రకటించారు. మిల్లర్ల చేతిలో ప్రభుత్వం, సివిల్సప్లై అధికారులు కీలుబొమ్మల్లా మారారని ఎద్దేవాచేశారు. అక్రమ రవాణాకు కాకినాడ, విశాఖ, మచిలీపట్నం పోర్టులు అడ్డాగా మారాయని ఆరోపించారు. బ్లాక్ మార్కెట్ నిరోధానికి సీఎం జగన్ చర్య తీసుకోవాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు.