ఏపీ ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్... ఆదివారం పని చేయాలని ఆదేశాలు

ABN , First Publish Date - 2022-01-30T03:05:35+05:30 IST

ఏపీలో ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం కూడా పని చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి..

ఏపీ ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్... ఆదివారం పని చేయాలని ఆదేశాలు

అమరావతి: ఏపీలో ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం కూడా పని చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాల్లోనే ఉండి బిల్లులను క్లియర్ చేయాలని ఆదేశాల్లో సూచించింది. ఈ మేరకు ఏపీలోని కార్యాలయాలన్నిటికీ వాట్సప్ మెసేజ్‌లు వెళ్లాయి. ఇతర శాఖల నుంచి వచ్చిన బిల్లులనూ క్లియర్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలుంటాయని ఉన్నతాధికారులు హెచ్చరించారు. 


మరోవైపు ప్రభుత్వ ఉద్యుగులకు జీతాల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రివైజ్డ్ పే స్కేల్ చెల్లింపులకు మార్చి 31 వరకు గడువును ఇచ్చినట్లు ఈ నెల 19న జారీ చేసిన మెమోలో ప్రభుత్వం వెల్లడించింది. అంతలోనే జనవరి నెల జీతాలను కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వేయాలంటూ ఉద్యోగుల మెడ మీద కత్తి పెట్టింది. ఓ వైపు సమయం ఉన్నా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ మరో మెమో జారీ చేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.   





Updated Date - 2022-01-30T03:05:35+05:30 IST