ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మళ్లీ షాక్‌

ABN , First Publish Date - 2022-04-27T20:02:55+05:30 IST

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ ఇచ్చినప్పటి నుంచి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా మరో షాక్‌ తగిలింది.

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మళ్లీ షాక్‌

అమరావతి : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ ఇచ్చినప్పటి నుంచి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా మరో షాక్‌ తగిలింది. గత సంవత్సరం డీఏ బిల్లులు అప్‌లోడ్‌ చేయకుండా ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్‌లో లాగిన్‌ క్లోజ్‌ చేసింది. ఇప్పటికే డీఏ బిల్లులను ప్రభుత్వం వెనక్కి పంపించేసింది. డీడీఓల నుంచి మరల సబ్‌ ట్రెజరీలకు డీఏ బిల్లులు వచ్చాయి. డీఏ బిల్లులను అప్‌లోడ్ చేసే ప్రభుత్వం లాగిన్‌ను మూసివేసింది. వేతనాలు, పెన్షన్లు మినహా మరే బిల్లు అప్‌లోడ్‌కు సీఎఫ్‌ఎంఎస్‌ అవకాశం ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 వేల కోట్ల రూపాయల డీఏ బిల్లులు ఆగిపోయాయి. 

Updated Date - 2022-04-27T20:02:55+05:30 IST