ఏపీలో ఆర్థిక విధ్వంసం, విస్ఫోటనం జరుగుతుంది: రఘురామ

ABN , First Publish Date - 2021-11-27T21:03:48+05:30 IST

ఏపీలో ఆర్థిక విధ్వంసం, విస్ఫోటనం జరుగుతుందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆక్షేపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

ఏపీలో ఆర్థిక విధ్వంసం, విస్ఫోటనం జరుగుతుంది: రఘురామ

ఢిల్లీ: ఏపీలో ఆర్థిక విధ్వంసం, విస్ఫోటనం జరుగుతుందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆక్షేపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పు తెస్తున్నారని తప్పుబట్టారు. దేశంలో ఇంతలా అప్పులు చేస్తున్న రాష్ట్రం ఏపీ తప్ప మరొకటి లేదన్నారు. ఆర్థిక విధ్వంసంపై ప్రధాని, ఆర్బీఐ బ్యాంక్‌లకు లేఖలు రాస్తానని తెలిపారు. కార్పొరేషన్ ద్వారా అప్పులు ఇచ్చి ప్రజలను బలిపశువులు చేయొద్దని సూచించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి మేరకు మాత్రమే అప్పులు ఇవ్వాలన్నారు. కాగ్ సహితం అప్పులపై తలలు పట్టుకొని ఏపీని వదిలేసే పరిస్థితి వచ్చిందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.


Updated Date - 2021-11-27T21:03:48+05:30 IST