ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోంది: రామకృష్ణ
ABN , First Publish Date - 2021-09-08T21:06:10+05:30 IST
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. బుధవారం
ప్రకాశం: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అప్పులు తీసుకుంటూ ప్రజలపై భారం మోపుతోందని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచకపోగా.. కుదిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో మంత్రులు స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారంటే.. వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని రామకృష్ణ ప్రశ్నించారు.