ట్యూషన్ ఫీజు 30శాతం తగ్గించి తీసుకోవాలి : ఏపీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-10-31T02:37:27+05:30 IST
ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజును 30శాతం తగ్గించి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి : ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజును 30శాతం తగ్గించి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఇందుకు సంబంధించిన ఉత్వర్వులను విద్యాశాఖ జారీ చేయడం జరిగింది. కోవిడ్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొన్నది. ట్యూషన్ ఫీజు 70శాతం మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను లెక్కజేయకుండా పూర్తి ఫీజు వసూలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ఒకింత హెచ్చరించింది.
కాగా.. రాష్ట్రంలో నవంబర్- 02 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. 2 నుంచి 9,10 తరగతులు, ఇంటర్కు క్లాస్లు జరుగుతాయి. నవంబర్-23 నుంచి 6,7,8 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్-14 నుంచి 1,2,3,4,5 తరగతులకు క్లాస్లు ప్రారంభమవుతాయి. రోజు విడిచి రోజు పాఠశాలల్లో తరగతులు నిర్వహించనున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహిస్తామని ఇదివరకే ప్రభుత్వం స్పష్టం చేసింది.