ఏపీ ప్రభుత్వం తప్పుచేస్తోంది: ఎల్లంకి వెంకటేశ్వర్లు

ABN , First Publish Date - 2020-03-29T18:59:25+05:30 IST

ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు విమర్శించారు.

ఏపీ ప్రభుత్వం తప్పుచేస్తోంది: ఎల్లంకి వెంకటేశ్వర్లు

నెల్లూరు: ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేషన్ షాపుల వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమికూడుతున్నారని, ఎవరూ సామాజిక దూరం పాటించడంలేదన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని చెబుతున్న సీఎం జగన్.. వారి చేతే ఇంటింటికి సరుకులు పంపిణీ చేయించవచ్చు కదా? అని అన్నారు. బియ్యం, చక్కెర ఇచ్చి కందిపప్పు ఇవ్వడం లేదని వెంకటేశ్వర్లు ఆరోపించారు. 

Updated Date - 2020-03-29T18:59:25+05:30 IST