రైలు ప్రయాణాలపై ఆంక్షలను తొలగించిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-06-03T01:47:25+05:30 IST

రైలు ప్రయాణాలపై ఆంక్షలను తొలగించిన ఏపీ ప్రభుత్వం

రైలు ప్రయాణాలపై ఆంక్షలను తొలగించిన ఏపీ ప్రభుత్వం

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అంతర్గత రైలు ప్రయాణాలపై ఆంక్షలను తొల‌గించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఆంక్షలు లేకుండా రైలు ప్రయాణం చేయవచ్చని తెలిపింది. రైలు ఆగే స్టేష‌న్ వ‌ర‌కూ మాత్రమే ప్యాసింజ‌ర్లకు టికెట్లు జారీ చేయాల్సి ఉంటుందని ఏపీ సర్కారు పేర్కొంది. జూన్ 4 నుంచి నడిచే ప్రత్యేక రైళ్ల స్టాపుల‌ను త‌గ్గిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.


Updated Date - 2020-06-03T01:47:25+05:30 IST