ఏపీ ప్రభుత్వం విద్యారంగాన్ని దిగజార్చింది: Jawahar
ABN , First Publish Date - 2022-06-06T23:22:07+05:30 IST
ఏపీ ప్రభుత్వం (AP government) విద్యారంగాన్ని దిగజార్చిందని మాజీమంత్రి కేఎస్ జవహర్ (KS Jawahar) దుయ్యబట్టారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వం (AP government) విద్యారంగాన్ని దిగజార్చిందని మాజీమంత్రి కేఎస్ జవహర్ (KS Jawahar) దుయ్యబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టెన్త్ ఫలితాల్లో 64.02 శాతం ఉత్తీర్ణత దీనికి తార్కాణమన్నారు. రంగులు మార్చి దోచుకోవడం తప్ప విద్యను మెరుగుపర్చింది లేదని తప్పుబట్టారు. ఒక్క డీఎస్సీనైనా నిర్వహించి ఉంటే ఇంత తక్కువ ఫలితాలు వచ్చేవి కాదని చెప్పారు. నాణ్యమైన విద్యలో 3వ స్థానం నుంచి 19వ స్థానానికి దిగజార్చారని ధ్వజమెత్తారు. ఆంగ్ల మాధ్యమం మోజులో మాతృభాషకు తూట్లు పొడిచారని కేఎస్ జవహర్ మండిపడ్డారు.