ఏపీలో దొంగలు పడ్డారు.. రాష్ట్రాన్ని దోచేస్తున్నారు: గోరంట్ల

ABN , First Publish Date - 2020-06-03T20:47:34+05:30 IST

ఏపీలో దొంగలు పడ్డారని, రాష్ట్రాన్ని దోచేస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగుతోందని, అవసరాలకు దొరకడం లేదని చెప్పారు.

ఏపీలో దొంగలు పడ్డారు.. రాష్ట్రాన్ని దోచేస్తున్నారు: గోరంట్ల

అమరావతి: ఏపీలో దొంగలు పడ్డారని, రాష్ట్రాన్ని దోచేస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగుతోందని, అవసరాలకు దొరకడం లేదని చెప్పారు. ఒకప్పుడు రాజమండ్రిలో 2 యూనిట్ల ఇసుక రూ.2600కు ఇంటికి చేరేదని, నేడు బ్లాక్‌లో 5 యూనిట్లు రూ.25వేలకు కొనాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ఓపెన్‌ అయిన 5 నిమిషాలకే క్లోజ్‌ అవుతోందని ఆరోపించారు. భూముల సేకరణలో దోపిడీ చేస్తున్నారని, పల్లపు భూముల్లో మెరకల పేరుతో దోపిడీ చేస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.

Updated Date - 2020-06-03T20:47:34+05:30 IST