ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2020-04-03T22:47:49+05:30 IST

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు ఎస్మా పరిధిలోకి తెచ్చారు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల చేశారు. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు ఎస్మా పరిధిలోకి తెచ్చారు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల చేశారు. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ చేశారు. ఎస్మా పరిధిలోకి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బందిని తెచ్చారు. వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణాను కూడా ఏపీ ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి చేర్చింది. మందుల కొనుగోలు, రవాణా, తయారీ, అంబులెన్స్‌ సర్వీసులు, మంచినీరు, విద్యుత్‌ సరఫరా, భద్రత, ఆహార సరఫరా, బయో మెడికల్‌ వేస్ట్‌ను ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి తెచ్చింది.

Updated Date - 2020-04-03T22:47:49+05:30 IST