పీఆర్సీ సాధన సమితి పేరుతో ఉద్యోగుల ఉద్యమం

ABN , First Publish Date - 2022-01-21T00:23:04+05:30 IST

పీఆర్సీ సాధన సమితి పేరుతో ప్రభుత్వంపై ఉద్యమానికి ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. పీఆర్సీ జీవోను..

పీఆర్సీ సాధన సమితి పేరుతో ఉద్యోగుల ఉద్యమం

విజయవాడ: పీఆర్సీ సాధన సమితి పేరుతో ప్రభుత్వంపై ఉద్యమానికి ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. పీఆర్సీ జీవోను విడుదల చేయొద్దంటూ ఉద్యోగ సంఘాలు నేతలు, ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాయి. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఈ మేరకు అమరావతి జేఏసీ, ఏపీ జేఏసీ, ఏపీ సచివాలయం జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు విజయవాడ ప్రైవేటు హోటల్‌లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. భేటీ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణను వెల్లడించనున్నారు. 

Updated Date - 2022-01-21T00:23:04+05:30 IST