ఉద్యోగుల ఆందోళనపై పునరాలోచనలో AP ప్రభుత్వం?
ABN , First Publish Date - 2022-01-31T17:28:14+05:30 IST
రాష్ట్రంలో ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించే మంత్రుల కమిటీ సభ్యులు ఎక్కడ ఉన్నారని సీఎంఓ అధికారులు ఆరా తీశారు. ఫిబ్రవరి మూడో తేదీన చలో విజయవాడకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమస్య పరిష్కారం దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది. హెచ్ఆర్ఎలో ఇప్పటికే ఇచ్చిన సడలింపులతో పాటు మరో స్లాబ్ పెట్టే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రెండు స్లాబులు రద్దుపై పునరాలోచించే అవకాశం ఉంది. డిఏ అరియర్స్లో ఐఆర్ మినహాయింపుపై ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు అన్వేషిస్తున్నారు. స్టీరింగ్ కమిటీకి ముందు నాలుగు జేఏసీల నేతలు బండి, బొప్పారాజు, వెంకట్రామిరెడ్డి, కె ఆర్ సూర్యనారాయణ విడిగా సమావేశమైన విషయం తెలిసిందే.