‘రఘురామ కేసులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది’

ABN , First Publish Date - 2021-05-19T21:34:30+05:30 IST

ఎంపీ రఘురామ కేసులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని హైకోర్టు అడ్వకేట్‌ ఉమేష్‌చంద్ర తెలిపారు.

‘రఘురామ కేసులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది’

అమరావతి: ఎంపీ రఘురామ కేసులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని హైకోర్టు అడ్వకేట్‌ ఉమేష్‌చంద్ర తెలిపారు. గురువారం ప్రభుత్వ కౌంటర్‌పై అభ్యంతరాలు ఉంటే పిటిషనర్ తరుపు కూడా కౌంటర్ వేయొచ్చన్నారు. రెండు కౌంటర్లు, చికిత్సకు సంబంధించిన సీల్డ్‌కవర్‌లు పరిశీలించి.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంటుందని ఉమేష్‌చంద్ర పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే రఘురామ చికిత్స కొనసాగుతోందని, ఇతర ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తే పారదర్శకత ఉండదని భావించిన సుప్రింకోర్టు.. అందుకే ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఆర్మీ ఆస్పత్రిలో వైద్యులు ప్రతి విషయాన్ని రికార్డెడ్‌గానే చేస్తారని ఉమేష్‌చంద్ర చెప్పారు.

Updated Date - 2021-05-19T21:34:30+05:30 IST