టెన్త్ క్లాస్ ‘ఆల్ పాస్’పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2021-07-12T18:41:40+05:30 IST
రాష్ట్రంలో పదవ తరగతి ‘ఆల్ పాస్’ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి: రాష్ట్రంలో పదవ తరగతి ‘ఆల్ పాస్’ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుకుంది. ఆల్ పాస్కు బదులు గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫార్మేటివ్, సమ్మేటివ్ మార్కుల ఆధారంగా గ్రేడ్లను ఖరారు చేయనుంది. భవిష్యత్లో ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు సమస్యలు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫార్మేటివ్, సమ్మేటివ్లలో ఎక్కువ మార్కులు వచ్చిన మూడు సబ్జెక్టుల సగటు ఆధారంగా గ్రేడ్లపై నిర్ణయం తీసుకోనున్నారు.