LIVE: ఏపీ గ్యాంగ్వార్లకు కేరాఫ్ అడ్రస్గా మారుతోందా?
ABN , First Publish Date - 2020-06-06T13:14:36+05:30 IST
LIVE: ఏపీ గ్యాంగ్వార్లకు కేరాఫ్ అడ్రస్గా మారుతోందా?
అమరావతి: ఏపీలో వరుసగా గ్యాంగ్ వార్లు కలకలం సృష్టిస్తున్నాయి. గ్యాంగ్ వార్లు విజయవాడ, వైజాగ్కే పరిమితం కాకుండా మిగితా జిల్లాల్లో కూడా ఈ తరహా వాతావరణం కనిపిస్తోంది. విజయవాడ కేంద్రంగా జరిగిన గ్యాంగ్ వార్ అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంటే....తాజాగా వైజాగ్లో అలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి. గతంలో గుంటూరులో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం కర్నూలులో వైసీపీ ఎమ్మెల్యేకు సంబంధించిన అనుచరులు...కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి ఇంటి దాడులు చేశారు. అనంతపురంలో టీడీపీ నాయకులకు చెందిన మామిడి చెట్లను పూర్తిగా నరికివేశారు. కడపలో కూడా అలాంటి తరహా ఘటనలే జరిగాయి. వరుసగా గడిచిన కొన్ని నెలలుగా ఏపీలో ఈ తరహా వాతావరణ ఎక్కువగా కనిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులపైన దాడులు చేయడం, వారి ఆస్తులను విధ్వంసం చేయడం, ప్రాణాలు తీయడం లాంటి ఘటనలు కొనసాగుతున్నాయి. ఏపీలో ఈ తరహాలో క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతోంది?..గ్యాంగ్ వార్లకు ఏపీ ఎందుకు కేరాఫ్గా మారుతోంది. దీనిపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చర్చ చేపట్టారు. ఈ చర్చలో టీడీపీ నేత శ్రవణ్కుమార్, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, సీపీఐ నేత జేవీఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.