Sonia Gandhiతో AP మాజీ ముఖ్యమంత్రి Kiran Kumar Reddy భేటీ
ABN , First Publish Date - 2022-05-21T00:23:10+05:30 IST
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన భేటీలో పార్టీ బలోపేతం చేసే అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. గత మూడు
Delhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన భేటీలో పార్టీని బలోపేతం చేసే అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి.. వ్యక్తిగత పనిపై ఢిల్లీ వచ్చానన్న చెప్పారు. కాగా కిరణ్ కుమార్ రెడ్డి మూడు రోజుల్లో పలువురు పార్టీ నేతలను కలిసినట్లు సమాచారం. సోనియాతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్కు బయలుదేరారు.