పరుల కష్టానికి వైసీపీ కబ్జా స్టిక్కర్‌ అంటే ఇదే: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-06-07T04:32:34+05:30 IST

'పరుల కష్టానికి కబ్జా స్టికర్‌' పేరుతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో విడుదల చేశారు. పాలనలో తమదైన ..

పరుల కష్టానికి వైసీపీ కబ్జా స్టిక్కర్‌ అంటే ఇదే: చంద్రబాబు

అమరావతి: 'పరుల కష్టానికి కబ్జా స్టికర్‌' పేరుతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో విడుదల చేశారు. పాలనలో తమదైన ముద్ర అంటే వైసీపీ నేతలు కొత్త అర్థం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మసిపూసి మారేడుకాయ చేయడమే ఏడాది వైసీపీ పాలన అని విమర్శించారు. అధికారంలోకి రాగానే 36కు పైగా టీడీపీ హయాంలోని పథకాలు రద్దు చేశారని మండిపడ్డారు. కొన్ని పథకాలకు పేర్లు మార్చి తమ స్టిక్కర్లు వేసుకున్నారని విమర్శించారు. అన్నదాత సుఖీభవను రైతు భరోసాగా మార్చడమే దీనికి సాక్ష్యమని చెప్పారు. అన్నదాత సుఖీభవ రుణమాఫీ ద్వారా రైతులకు రూ. లక్షా 10వేలు వచ్చేవన్నారు. రైతు భరోసా ముసుగుతో ప్రతి రైతుకు రూ.75 వేల నష్టం చేశారని మండిపడ్డారు. ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని రూ. 6వేలు ఎగ్గొట్టారన్నారు. ఎప్పుడో తెచ్చిన పథకాలను తామే తెచ్చామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పరుల కష్టానికి వైసీపీ కబ్జా స్టిక్కర్‌ అంటే ఇదేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 


Updated Date - 2020-06-07T04:32:34+05:30 IST