ఇది దగా పీఆర్సీ: ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-01-20T18:00:54+05:30 IST

పీఆర్సీపై ఏకపక్ష జీవో జారీ చేసిన జగన్ ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగ సంఘాలు సమరానికి సిద్ధమయ్యాయి.

ఇది దగా పీఆర్సీ: ఉద్యోగులు

అమరావతి: పీఆర్సీపై ఏకపక్ష జీవో జారీ చేసిన జగన్ ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగ సంఘాలు సమరానికి సిద్ధమయ్యాయి. గురువారం అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. ఈ సందర్బంగా ఉద్యోగులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఇది దగా పీఆర్సీ అని విమర్శించారు. ఈ పీఆర్సీని తాము అంగీకరించమని స్పష్టం చేశారు. ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకు కూడా నష్టం జరుగుతుందన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట మరిచిపోయి ఆయన అనుకున్న విధంగా చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మిశ్రా కమిటీ నివేదికను పక్కనపెట్టి.. అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం పీఆర్సీని ప్రకటించారని, దీన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జీవోలను వెనక్కి తీసుకుని తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం  చేశారు.

Updated Date - 2022-01-20T18:00:54+05:30 IST