ఎంసెట్‌కు రెండో రోజు 83% మంది హాజరు

ABN , First Publish Date - 2020-09-19T09:03:56+05:30 IST

ఎంసెట్‌కు రెండో రోజు 83% మంది హాజరు

ఎంసెట్‌కు రెండో రోజు 83% మంది హాజరు

ఏపీ ఎంసెట్‌-ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షకు శుక్రవారం 83.10% మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఏపీ, తెలంగాణల్లో కలిపి 41,019 మంది అభ్యర్థులు రిజిస్టర్‌ కాగా 34,087 మంది హాజరయ్యారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించిన మొదటి విడత పరీక్షకు 19,987 మంది రిజిస్టర్‌ కాగా 16,474 (82.42%) మంది , సాయంత్రం 3 నుంచి 6 గం. వరకు జరిగిన రెండో విడత పరీక్షకు 21,032 మంది రిజిస్టర్‌ కాగా 17,613 (83.74%) మంది హాజరయ్యారు. కాగా శని, ఆదివారాలు సెలవు. తిరిగి సోమవారం నుంచి ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.

Updated Date - 2020-09-19T09:03:56+05:30 IST