కేంద్రం లేఖ.. జగన్‌రెడ్డి సర్కార్‌కి చెంపపెట్టు: టీడీపీ నేత పట్టాభి

ABN , First Publish Date - 2022-01-23T19:23:23+05:30 IST

కేంద్రం లేఖ.. జగన్‌రెడ్డి సర్కార్‌కి చెంపపెట్టు: టీడీపీ నేత పట్టాభి

కేంద్రం లేఖ.. జగన్‌రెడ్డి సర్కార్‌కి చెంపపెట్టు: టీడీపీ నేత పట్టాభి

అమరావతి: ఏపీలో ఆర్థిక అరాచకత్వం నడుస్తోందని టీడీపీ నేత పట్టాభి రామ్ విమర్శించారు. ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్లే రాష్ట్ర ఖజానా దివాలా తీసిందని ఆయన మండిపడ్డారు. జగన్‌రెడ్డి ప్రభుత్వ లూటీ వల్ల ఏపీకి ప్రపంచ ఆర్థికసంస్థలు నిధులిచ్చే పరిస్థితి లేదని పట్టాభి అన్నారు. వివిధ ప్రపంచ బ్యాంకుల నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థికశాఖ ఘాటు లేఖ రాసిందని పట్టాభి గుర్తు చేశారు. భవిష్యత్తులో ప్రపంచ బ్యాంక్‌ల నుంచి నిధులు విడుదల కావాలంటే తమ షరతులను తక్షణమే అమలు చేయాలని చెప్పిందని పట్టాభి తెలిపారు. కేంద్ర ఆర్థికశాఖ లేఖ జగన్‌రెడ్డి సర్కార్‌కి చెంపపెట్టు అని పట్టాభి అన్నారు. కేంద్రం లేఖ ద్వారా వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో జగన్‌రెడ్డి సర్కార్ చేసిన దోపిడీ స్పష్టమవుతోందని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-01-23T19:23:23+05:30 IST