ఏపీ ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదల
ABN , First Publish Date - 2022-03-23T19:18:01+05:30 IST
ఏపీ ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదలైంది. బుధవారం మంత్రి ఆదిమూలపు సురేష్ షెడ్యూల్ను విడుదల చేశారు.
అమరావతి: ఏపీ ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదలైంది. బుధవారం మంత్రి ఆదిమూలపు సురేష్ షెడ్యూల్ను విడుదల చేశారు. జులై 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంసెట్-2022 పరీక్ష, జూలై 11, 12 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పరీక్షల కోసం మొత్తం 136 సెంటర్లులో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణలో 4 సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 11న నోటిఫికేషన్ను విడుదల చేస్తామన్నారు. పరీక్షా సమయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్ రెండో వారం నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని.... ఎగ్జామినేషన్ ర్యాంకులు ప్యాట్రన్లో మార్పు లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.