అందరి మంచి కోరే వ్యక్తి సీఎం జగన్: ఉప ముఖ్యమంత్రి ధర్మాన

ABN , First Publish Date - 2021-09-16T02:17:40+05:30 IST

రాష్ట్రంలోని అందరి మంచి కోరే వ్యక్తి సీఎం జగన్ అని ఉప ముఖ్యమంత్రి

అందరి మంచి కోరే వ్యక్తి సీఎం జగన్: ఉప ముఖ్యమంత్రి ధర్మాన

కృష్ణా: రాష్ట్రంలోని అందరి మంచి కోరే వ్యక్తి సీఎం జగన్ అని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు అన్నారు. బాపులపాడు మండలంలోని వేలేరు జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఉపముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాసు పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మానను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. పాఠశాలలలో వసతుల గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులను ధర్మాన కృష్ణదాసు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అందరి మంచి కోరే వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. రాష్ట్రంలో  విద్య, వైద్యం, వ్యవసాయం అభివృద్ధే  సీఎం జగన్ ఆలోచనలో ప్రధాన అంశమన్నారు. రాజకీయ ప్రయోజనాలను చూడకుండా అందరి మంచి కోరే వ్యక్తి సీఎం జగన్ అని ఆయన పేర్కొన్నారు.


250 మీటర్లు రోడ్డు పాడైతే పాడైన రోడ్డును ప్రతిపక్ష నాయకులు భూతద్దంలో చూపిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలోనే రోడ్లన్నీ పాడయ్యాయని ఆయన ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి పాలన వచ్చి 27 నెలలు మాత్రమే అయిందన్నారు. వర్షాలు తగ్గగానే రోడ్లపై దృష్టి పెట్లాలని సీఎం జగన్ అన్నారని ధర్మాన కృష్ణదాసు తెలిపారు. 

Updated Date - 2021-09-16T02:17:40+05:30 IST