నేడు, రేపు చిత్తూరు జిల్లాలో సీఎస్‌ పర్యటన

ABN , First Publish Date - 2022-03-19T12:23:04+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ శని, ఆదివారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు.

నేడు, రేపు చిత్తూరు జిల్లాలో సీఎస్‌ పర్యటన

  • కొత్త జిల్లాల ఏర్పాట్లపై తిరుపతిలో సమీక్ష


చిత్తూరు : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ శని, ఆదివారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరి పద్మావతి నిలయంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న శ్రీ బాలాజీ జిల్లా కలెక్టరేట్‌ను సందర్శిస్తారు. శాఖలవారీ ఏర్పాట్లను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి గంటపాటు పద్మావతి అతిథి గృహంలో కలెక్టర్‌, జేసీలతో సమీక్షిస్తారు. స్పందన ద్వారా అందిన అర్జీలు, పరిష్కారాలు, పెండింగ్‌లో ఉన్న అర్జీలపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీస్తారు. శ్రీబాలాజీ జిల్లా ఏర్పాట్ల ప్రగతిపై సమీక్షిస్తారు. సాయంత్రం 4 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని.. తిరుమల చేరుకుంటారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని.. తిరుగు ప్రయాణమవుతారు. సీఎస్‌ పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్‌లో అందుబాటులో ఉన్న అధికారుల తో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు.

Updated Date - 2022-03-19T12:23:04+05:30 IST