సుప్రీం విచారణకు హాజరైన ఏపీ సీఎస్
ABN , First Publish Date - 2022-01-19T21:37:29+05:30 IST
కరోనాతో మరణించిన బాధితుల కుటుంబాలకు కొవిడ్ పరిహారం
అమరావతి: కరోనాతో మరణించిన బాధితుల కుటుంబాలకు కొవిడ్ పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీం ఆదేశాలతో వర్చువల్గా విచారణకు ఏపీ సీఎస్ సమీర్ శర్మ హాజరయ్యారు. కొవిడ్ పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం చేసింది. కొవిడ్ బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.45కోట్ల మేరా బకాయిలను ఏపీ సర్కార్ పెండింగ్లో పెట్టింది.