ఏపీ కరోనా అప్‌డేట్.. కొత్తగా 70 కేసులు

ABN , First Publish Date - 2020-05-30T19:26:00+05:30 IST

ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది.

ఏపీ కరోనా అప్‌డేట్.. కొత్తగా 70 కేసులు

అమరావతి: ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. గత 24 గంటల్లో 9504 శాంపిల్స్‌ని పరీక్షించగా 70 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 55 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2944 పాజిటివ్ కేసులకు గాను 2092 మంది డిశ్చార్జ్ అయ్యారు. 60 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 792. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో చిత్తూర్ జిల్లాలో ముగ్గురు కోయంబేడు నుంచి వచ్చినవారున్నారు. 





Updated Date - 2020-05-30T19:26:00+05:30 IST