ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-01-15T22:49:03+05:30 IST
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 4,955 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం ...
అమరావతి: ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 4,955 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 21,01,710 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా వైరస్తో 14,509 మంది మరణించారు. అలాగే ఏపీలో 22,870 యాక్టివ్ కేసులు ఉండగా, 20,64,331 మంది రికవరీ అయ్యారు.