ఏపీలో కొత్తగా 5,646 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-06-20T23:50:48+05:30 IST

ఏపీలో కొత్తగా 5,646 కరోనా కేసులు నమోదు

ఏపీలో కొత్తగా 5,646 కరోనా కేసులు నమోదు

అమరావతి: ఏపీలో రోజురోజుకూ కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,646 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ తో  50 మంది మృతి చెందారు. మొత్తం కరోనా కేసులు 18,50,563గా ఉండగా, కరోనా వైరస్ తో  12,319 మంది మరణించారు. యాక్టివ్‌ కేసులు 63,068 ఉండగా, 17,75,176 రికవరీ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 7,772 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాతో చిత్తూరు జిల్లాలో 11 మందిపశ్చిమగోదావరి జిల్లాలో 7, గుంటూరు 6, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు మృతి చెందగా, అనంతపురం, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి, నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. 

Updated Date - 2021-06-20T23:50:48+05:30 IST