ఏపీ తగ్గుతున్న కరోనా మరణాలు

ABN , First Publish Date - 2021-06-12T23:51:11+05:30 IST

గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,952 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో మొత్తం

ఏపీ తగ్గుతున్న కరోనా మరణాలు

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,952 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో మొత్తం 18,03,074కు కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 58 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 11,882 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 91,417 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 16,99,775 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 11,577 మంది కోలుకున్నారు. 


ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరులో 9 మంది, తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు మృతి చొప్పున మృతి చెందారు. అనంతపురం, కృష్ణా, విశాఖలో ఐదుగురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలులో ముగ్గురు, గుంటూరు, విజయనగరంలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కడప, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

Updated Date - 2021-06-12T23:51:11+05:30 IST