ఏపీలో కొత్తగా 998 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-07-05T20:21:40+05:30 IST
ఏపీలో కొత్తగా 998 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా బులెటిన్ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది.
అమరావతి: ఏపీలో కొత్తగా 998 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా బులెటిన్ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. పాజిటివ్ కేసులలో ఏపీకి చెందిన వారు 961 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 36 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారించారు. ఏపీలో ఇప్పటి వరకు 18,697 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 232 మంది మృతి చెందారు. 10,043 వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 8,422 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,17,140 మందికి కరోనా పరీక్షలు జరిగాయి.