ఆ కేసును సీబీఐకు అప్పగించాలి.. ఏపీ కాంగ్రెస్ డిమాండ్

ABN , First Publish Date - 2020-09-28T03:21:02+05:30 IST

చిత్తూరు జిల్లా కొత్తకోటలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై హత్యాయత్నాన్ని ..

ఆ కేసును సీబీఐకు అప్పగించాలి.. ఏపీ కాంగ్రెస్ డిమాండ్

అనంతపురం: చిత్తూరు జిల్లా కొత్తకోటలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై హత్యాయత్నాన్ని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాధ్, పీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్ ఖండించారు. జడ్జి రామకృష్ణ సోదరుడిపై హత్యాయత్నం దుర్మార్గమని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాధ్ అన్నారు. జగన్ ప్రభుత్వంలో దళితులకు జీవించే హక్కులేదా? అని ఆయన ప్రశ్నించారు.  ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని శైలాజానాధ్ సూచించారు. 


పీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్ మాట్లాడుతూ జగన్‌ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దాడి కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. హత్యాయత్నంతో ప్రమేయమున్న మంత్రి పెద్దిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని జంగా గౌతమ్ డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-09-28T03:21:02+05:30 IST