మాట్లాడేందుకు సీఎం సమయమివ్వట్లేదు: శైలజానాథ్

ABN , First Publish Date - 2020-12-05T22:15:59+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో మాట్లాడాలని లెటర్ రాస్తే సీఎం నుంచి స్పందన లేదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు

మాట్లాడేందుకు సీఎం సమయమివ్వట్లేదు: శైలజానాథ్

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో మాట్లాడాలని లెటర్ రాస్తే సీఎం నుంచి స్పందన లేదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై కలవాలని సీఎంకి లేఖ రాసినట్లు చెప్పారు. శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్‌లు చేశారు. రైతుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని సీఎంను అడగాలని అనుకున్నాం. అలాగే ఉచిత విద్యుత్‌కి మంగళం పాడొద్దు అని కూడా అడగాలని భావించాం. పోలవరం ప్రాజెక్ట్‌పై సవాల్ ప్రతి సవాల్ చూసాం. పోలవరం విషయంలో మొదటి ముద్దాయి చంద్రబాబు అయితే.. అసలు ముద్దాయి జగన్. పోలవరం నిర్మాణం కేంద్రం చేయాల్సి వస్తే మీరెందుకు కడుతున్నారు. నియంతృత్వానికి ప్రజా స్వామ్యంలో స్థానం లేదు. అసెంబ్లీలో జరిగే విధానం చూస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజలు ఛీదరించు కుంటున్నారు. మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అరవటం కరవటం ఒకటే తెలుసు. మరోసారి మాతో మాట్లాడాలని సీఎంకి లేఖ రాస్తాం.. అప్పుడు కూడా స్పందన లేకుంటే ఏమి చేయాలో అది చేస్తాం’ అని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-12-05T22:15:59+05:30 IST